contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

ఉరి కి స్టే ఇవ్వాలని నిర్భయ కేసు దోషులు సుప్రీం కోర్టులో మరో రివ్యూ పిటిషన్

‘నిర్భయ’ కేసులో దోషులను రేపు తిహార్‌ జైల్లో ఉరి తీయడానికి అధికారులు ఏర్పాట్లు చేసుకుంటోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో పిటిషన్‌లు వేసి ఉరి శిక్ష అమలులో జాప్యమయ్యేలా చేసుకున్న దోషులు తమ ప్రయత్నాలను చివరి గంటల్లోనూ కొనసాగిస్తున్నారు. ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో దోషి పవన్ గుప్తా రివ్యూ పిటిషన్‌ వేశాడు. నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను మైనర్‌ అని వేసిన పిటిషన్‌ను కొట్టివేయడాన్ని సవాల్‌ చేస్తూ అతడు రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాడు. తీర్పును పునఃసమీక్షించాలని, ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని కోరాడు. నిర్భయ కేసులో ముగ్గురు దోషులను ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు  ఇటీవలే డెత్‌ వారెంట్‌ ఇచ్చింది. దాని ప్రకారం రేపు ఉదయం 6 గంటలకు దోషులను ఉరితీయాల్సి ఉంది. మరోవైపు, ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని, దోషులందరూ అన్ని న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకునేవరకు ఉరిశిక్ష అమలు చేయవద్దని కోరుతూ ఢిల్లీ కోర్టులో నిన్న దాఖలైన పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. ఈ పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాల్సిందిగా తిహార్ అధికారులకు నోటీసులు జారీ చేసింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :