contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

కొంతమంది పోలీసుల దురుసు ప్రవర్తన విమర్శల పాలవుతోంది వెంటనే చెర్యలు తీసుకోవాలి : కేటీఆర్

కొంతమంది పోలీసుల దురుసు ప్రవర్తన విమర్శల పాలవుతోంది వెంటనే చెర్యలు తీసుకోవాలి : కేటీఆర్
వేలాది మంది పోలీసులు రోడ్లపై ఉంటూ.. క్షణం తీరిక లేకుండా పని చేస్తున్నారు. కరోనా భూతం నుంచి ప్రజలను కాపాడుకొనేందుకు తమ ప్రాణాలను ఒడ్డుతున్నారు. వారి సేవలకు దేశమంతా నమస్కరిస్తుంటే.. కొంతమంది పోలీసుల దురుసు ప్రవర్తన విమర్శల పాలవుతోంది. తాజాగా ఓ నెటిజన్ చేసిన ట్వీట్ పోలీసుల వర్గాలను సైతం విస్మయ పరుస్తోంది. ఆ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ADVERTISEMENT
వివరాల్లోకి వెళితే.. సామాన్యులపై పోలీసుల దురుసు ప్రవర్తనను ప్రశ్నిస్తూ లక్ష్మణ్ అనే నెటిజన్ ట్వీట్ చేశారు. వీడియోను అనుసరించి.. తన కుమారుడితో కలిసి వెళుతున్న ఓ వ్యక్తితో పోలీసులకు వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఓ కానిస్టేబుల్ ఆ వ్యక్తిని కిందపడేసి విచక్షణా రహింతగా దాడి చేశాడు. అక్కడున్న పోలీసులు అతన్ని విడిపించి జీపులో కూర్చోబెట్టారు. అయితే అక్కడే ఉన్న ఆ వ్యక్తి కుమారుడు బెంబేలెత్తిపోయి.. ‘డాడీ వద్దు.. అంకుల్ ప్లీజ్’ అంటూ కన్నీళ్లతో వేడుకోవడం అందరినీ కలచి వేసింది. ఈ వీడియో కేటీఆర్‌ను చేరడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. కొంతమంది ప్రవర్తనతో వేలాదిమంది కష్టం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిలన కోరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :