కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకొని గ్రామాల్లో పురోహితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు, ఈ సందర్భంగా రాసి ఫలాలతో పాటు వర్షాలు పాడి పంటలు ఇతర అంశాలపై పండితులు పంచాంగ శ్రవణం ద్వారా వివరించారు. కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, శ్రీ స్వయంభు మానస దేవి ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు, ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు బూర వెంకటేశ్వర్, యువజన సంఘాల జిల్లా నాయకులు తిప్పర్తి పరిపూర్ణ చారి, సంధవేణి ఐలయ్య బుర్ర ఎల్లయ్య గౌడ్, మండల ప్రజలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.