contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బంగ్లాదేశ్‌లో మోదీ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు…..నలుగురు మరణం

 

భారత  ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌ పర్యటనకు వ్యతిరేకంగా ఆ దేశంలో ఆందోళనలు జరిగాయి. శుక్రవారం పలు చోట్ల జరిగిన నిరసనలు హింసకు దారి తీశాయి. ఈ క్రమంలో ఘర్షణలను అడ్డుకునేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు చిట్టగాంగ్‌లోనూ మోదీ పర్యటనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిరసనకారులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో నిరసనకారులను అదుపు చేసేందుకు టియర్‌ గ్యాస్ షెల్స్‌, రబ్బర్‌ బులెట్లు ప్రయోగించినట్లు ఆ దేశ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు మరణించగా పలువురు గాయపడినట్లు చెప్పారు. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో కూడా మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ కొందరు ఆందోళనలకు దిగారు. పోలీసులు లాఠీచార్జ్‌ చేయగా ఇద్దరు పాత్రికేయులతో పాటు పదుల సంఖ్యలో నిరసనకారులు గాయపడ్డట్లు సమాచారం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :