పలు అంశాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని పోలీసులు వేధిస్తున్నారని.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. పోస్టులు పెడుతున్నవారిపై సీఐడీ వేధింపులను ఖండించారు. దీనిపై ఏపీ డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డికి తాజాగా ఓ లేఖలో ఫిర్యాదు చేశారు. అక్రమంగా అదుపులోకి తీసుకుంటున్నారు సీఐడీ అధికారులు గార్లపాటి వెంకటేశ్వరరావు, మోకర్ల సాంబశివరావులను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని.. అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి అదుపులోకి తీసుకోవడం ఏమిటని […]
POLITICS
బిజెపి హావ మరో 30-40 ఏళ్లు కొనసాగుతుంది : అమిత్ షా
జాతీయ బిజెపి కార్యవర్గ సమావేశాలు హైదరాబాదులో జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే 30-40 ఏళ్లు బీజేపీ శకం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్ మిగతా దేశాలకు దారిచూపే ‘విశ్వ గురువు’గా ఎదుగుతుందని అన్నారు. అయితే, కుటుంబ పాలనలు, కుల రాజకీయాలు, వెన్నెముకలేని రాజకీయాల వంటివి దేశానికి పట్టిన దరిద్రాలు అని వివరించారు. ఏళ్ల తరబడి దేశ దుస్థితికి ఇవే కారణమని అభిప్రాయపడ్డారు. […]
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో హరీశ్ రావు భేటీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు బుధవారం భేటీ అయ్యారు. జీఎస్డీ కౌన్సిల్ సమావేశాల్లో పాలుపంచుకునే నిమిత్తం బుధవారం ఢిల్లీకి వెళ్లిన హరీశ్ రావు మర్యాదపూర్వకంగానే సీతారామన్తో భేటీ అయినట్లు సమాచారం. ఈ భేటీలో తెలంగాణకు చెందిన అంశాలేమీ కూడా ప్రస్తావనకు రాలేదని సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపపేణా తెలంగాణ చెల్లించిన మొత్తం.. రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణకు కేంద్రం […]
ధర్మవరంలో ప్రెస్ మీట్ జరుగుతుండగా బీజేపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడి
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా, కర్రలు, రాడ్లతో వచ్చిన వ్యక్తులు తీవ్రస్థాయిలో దాడికి పాల్పడడం తెలిసిందే. దీనిపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. బీజేపీ నేతలపై నేడు ధర్మవరం ప్రెస్ క్లబ్ లో దాడి జరిగిందని తెలిపారు. పట్టపగలు… పాత్రికేయుల సమావేశం జరుగుతుండగా వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. కాగా, ఈ దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని […]
సొంత పార్టీ వాళ్లే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు : వైసీపీ కీలక నేత బాలినేని
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీలో కీలక నేత, పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమీప బంధువుగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై సొంత పార్టీ వాళ్లే కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అలా సొంత పార్టీలో ఉంటూనే తనపై కుట్రలు చేస్తున్న వారెవరో తనకు తెలుసునని చెప్పిన […]
పోలీసుపై ఉమ్మేసిన మహిళా కాంగ్రెస్ నాయకురాలు … వీడియో చూడండి
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తున్న తీరుకు నిరసనగా ఆ పార్టీ శ్రేణులు కొనసాగిస్తున్న ఆందోళనల్లో మంగళవారం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నిరసనల్లో పాలుపంచుకుంటున్న తమను నిలువరించే యత్నం చేస్తున్న పోలీసులపై మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా ఏకంగా ఉమ్మేసి కలకలం రేపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. మంగళవారం ఐదో రోజు రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరైన సంగతి […]
మోదీని టార్గెట్ చేసిన శ్రీలంక అధికారులు .. మోడీ .. ఎందుకు స్పందించడం లేదు?: కేటీఆర్
శ్రీలంక 500 మెగావాట్ల విండ్ పవర్ ప్లాంట్ ను ఎలాంటి పోటీ లేకుండానే అదానీ దక్కించుకున్నారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును అదానీ గ్రూప్ కు కట్టబెట్టాలని శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై భారత ప్రధాని మోదీ ఒత్తిడి తీసుకొచ్చారని ఆ దేశ విద్యుత్తు సంస్థ అధ్యక్షుడిగా పని చేసిన ఎంఎంసీ ఫెర్డినాండో ఇటీవల వెల్లడించారు. ఈ అంశం శ్రీలంకలో పెను దుమారమే లేపింది. అదానీ గ్రూప్ కు వ్యతిరేకంగా అక్కడ నిరసన కార్యక్రమాలు […]
రాష్ట్రపతి రేసులో ‘లాలూ ప్రసాద్ యాదవ్’ … అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు
రాష్ట్రపతి ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ బరిలో దిగుతున్నారు. అయితే, ఈ లాలూ ప్రసాద్ యాదవ్ మీరు అనుకునే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కాదు. ఈయన ఓ సాధారణ రైతు. బీహార్ లోని సరన్ జిల్లాకు చెందినవాడు. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఈ నెల 15న ఢిల్లీలో నామినేషన్లు వేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన ఈ లాలూ ప్రసాద్ యాదవ్ కు గతంలోనే ఉంది. 2017లోనూ నామినేషన్ వేశాడు. అయితే, తన […]
స్మశానంలో పుట్టిన పార్టీ వైసిపి పార్టీ ….. స్మశానంలో కలిసిపోతుంది : యరపతినేని శ్రీనివాసరావు
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ పోలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య, గురజాల మాజీ శాసనసభ్యులు సభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి దావోస్ పర్యటన పై శ్వాసపత్రమం విడుదల చేయాలని డిమాండ్ చేశారు , 11రోజుల పర్యటన పై రోజు వారీ వివరాలు ప్రజలకు తెలపాలని తిరుమల బ్రహ్మోత్సవాల్లో సైతం ఒంటిరిగా వెళ్ళే మీరు అధికార పర్యటనలో అధికారుల తో సంబంధం లేకుండా భార్యతో ఎలా వెళ్ళారో ప్రజలకి […]
తలకిందులుగా తపస్సు చేసినా జగన్ ఇక సియం కాలేడు : యరపతినేని
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ పోలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య, గురజాల మాజీ శాసనసభ్యులు సభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి దావోస్ పర్యటన పై శ్వాసపత్రమం విడుదల చేయాలని డిమాండ్ చేశారు , 11రోజుల పర్యటన పై రోజు వారీ వివరాలు ప్రజలకు తెలపాలని తిరుమల బ్రహ్మోత్సవాల్లో సైతం ఒంటిరిగా వెళ్ళే మీరు అధికార పర్యటనలో అధికారుల తో సంబంధం లేకుండా భార్యతో ఎలా వెళ్ళారో ప్రజలకి […]