contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అక్రమ ఆస్తుల కేసులో కామారెడ్డి డిఎస్పీ లక్ష్మీనారాయణ అరెస్ట్

 

  • శని, ఆదివారాల్లో నూ హైదరాబాద్‌లోని  ఆయన నివాసంలో ఏసీబీ సోదాలు
  • 17 వ్యవసాయ భూములు, 5 నివాస స్థలాలు,మూడు ఇండ్లు గుర్తింపు
  • బుల్లెట్లు బయటపడడంతో మరో కేసు నమోదు 
  • తిరుమలగిరిలోని సొంతింట్లో లభ్యమైన డాక్యుమెంట్లపై ఆరా
  • పోలీసు శాఖలో కలకలం..

(చట్టం – నిజామాబాద్) కామారెడ్డి డీఎస్పీ లక్ష్మినారాయణ అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు అవినీతి శాఖ జరిపిన దాడుల్లో తేల్చారు. హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆయన భారీగా అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు. సికింద్రాబాద్, తిరుమలగిరిలో 30 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో ఐదుగురు నిందితులకు బెయిలు ఇచ్చేందుకు కామారెడ్డి ఇన్‌స్పెక్టర్‌ జగదీష్‌… నిందితుల నుంచి 5 లక్షల రూపాయలు డిమాండ్‌ చేశాడు. నిందితులు ముందుగా లక్షాయాభై వేల రూపాయలు నగదు ఇస్తుండగా… ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

ఈ కేసులో కామారెడ్డి సీఐ, ఎస్‌ఐ, మధ్యవర్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన వద్ద లభించిన మరికొంత నగదు గురించి అధికారులు విచారించగా… ఆ నగదు డీఎస్పీ లక్ష్మినారాయణకు చెందినదని సీఐ తెలిపారు. దీంతో ఏసీబీ బృందం అనుమానంతో హైదరాబాద్‌లోని తిరుమలగిరి, నిజామాబాద్‌, నల్గొండ కామారెడ్డి రంగారెడ్డి జిల్లాల్లో ఆయన, బంధువుల నివాసాల్లో సోదాలు నిర్వహించింది.

అధికారులు జరిపిన సోదాల్లో ఆయా జిల్లాల్లోని 17 వ్యవసాయ భూములు, 5 ఇళ్ల ఖాళీ స్థలాలు, తిరుమలగిరి, సరూర్‌నగర్‌, మిర్యాలగూడ ప్రాంతాల్లో భవనాలతోపాటు బంగారం, నగదు లభించింది. వాటి విలువ సుమారు రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయలని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు డీఎస్పీ లక్ష్మినారాయణను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :