contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఆర్మీ ట్రైనీ జవాన్ ఆత్మహత్య – కుటుంబాన్ని ఆదుకున్న జయహో జనతా జవాన్స్

 

కరీంనగర్  వట్టేమల : ఇటీవల వట్టేమల గ్రామానికి చెందిన బాలుసాని వెంకటేష్ కొత్తగా ఈ సంవత్సరం లో ఆర్మీ లో ఉద్యోగం పొంది ట్రైనింగ్ సమయం లో కాలికి గాయం అవడం వలన  మెడికల్ లీవ్  లో ఇంటికి వచ్చాడు .  ఆ గాయం పూర్తిగా నయం కాకుండా,ట్రైనింగ్ గురించి, ఆర్మీ లో ఎలా మళ్ళీ జాయిన్ అయ్యి ట్రైనింగ్ ఎలా పూర్తి చేయాలి అని మనస్థాపము చెంది కొద్ది రోజులు క్రితం ఇంట్లో ఎవరు లేని సమయం లో ఉరి వేసుకొని చనిపోయాడు . 

ఉమ్మడి కరీంనగర్ జిల్లా  కి చెందిన జై యహో జనతా – జవాన్ సెర్వింగ్ సోల్జర్స్ లీవ్ లో ఉన్న వాళ్ళు అందరు కలిసి మృతుడు  వెంకటేష్  కుటుంబానికి  కి 40, 000 రూపాయలు  వేములవాడ  C.I నవీన్ కుమార్, వట్టే మల సర్పంచ్ యామ సుమతి తిరుపతి సమక్షంలో అందించారు. 

ఈ కార్యక్రమం లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జయహో జనతా జవానులు విక్రమ్ -కొలిమికుంట, జితేందర్ – జమ్మికుంట, కిషోర్ – కోరుట్ల,శ్రవణ్ – కరీంనగర్,జెమినీ సతీష్ – చొప్పదండి, గంగయ్య – నర్సింగాపూర్,దేవేందర్ – కొలనూర్,దేవేందర్ – ఇల్లంతకుంట,నరేష్ – వేములవాడ,కర్ణాకర్ – వేములవాడ పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :