కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని ఖాసీంపెట్ గ్రామంలో సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న ఆధ్వర్యంలో బుధవారం సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి తో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం 500 మంది మహిళలతో కలిసి మొక్కలు నాటారు, ఈకార్యక్రమంలో ఎంపీటీసీ ఏలేటి స్వప్న చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, గ్రామ ప్రజలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు