contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గిఫ్ట్ ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న మోసగాళ్ళ ముఠా అరెస్టు

వరంగల్ పోలీసు కమిషనరేట్: గిఫ్ట్ వచ్చిందని అన్లైన్ వినియోగదారులను నమ్మంచి డబ్బులను దోచుకుంటున్న మోసాలకు పాల్పడుతున్న 13మంది సభ్యులమ ముఠాను టాస్క్ ఫోర్స్ మరియు ఇంతేజార్ గంజ్ పోలీసుల సంయుక్తంగా కల్సి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ముఠా సభ్యుల నుండి 14లక్షల 36వేల రూపాలతో పాటు 15 సెల్ ఫోన్లు, స్క్రాచ్ కార్డులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 పోలీసులు అరెస్టు చేసిన వారిలో… 1. ఇప్పరాజ్ కుమార్, అంబేద్కర్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల్ జిల్లా. (ప్రధాన నిందితుడు) 2. తాళ్లపల్లి దామోదర్ గౌడ్ అలియాస్ దాము బాయ్, అంబేద్కర్ నగర్ బెల్లంపల్లి, మంచిర్యాల్ జిల్లా, 3. దాసరి హరీష్ గౌడ్, అంబేద్కర్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల్ జిల్లా. 4. మేకల అదిత్య, గుడిపల్లి గ్రామము, మందమర్రి మండలం, మంచిర్యాల్ జిల్లా. 5. ఆకునూరి శ్రవణ్ కుమార్, మంచిర్యాల జిల్లా, 6.గంగాధర్ రాకేశ్, చాకపల్లి గ్రామము, బెల్లంపల్లి మండలం, మంచిర్యాల జిల్లా. 7. పోరండ్ల విజయ్, అంబేద్కర్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల్ జిల్లా, 8. ఈద రవికుమార్, పోన్నారం గ్రామము, మందమర్రి మండలం, మంచిర్యాల జిల్లా, 9. దార్శ గణేష్, శంషీర్ నగర్, బెల్లంపల్లి మండలం, మంచిర్యాల జిల్లా, 10. సిరికొండ వినోద కుమార్

మందమర్రి, ప్రస్తుతం హన్మకొండ నివాసం, 11. వోల్లల ప్రవీణ్, అంబేద్కర్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల్ జిల్లా, 12.గంగాధరి రాంచందర్, అంబేద్కర్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల్ జిల్లా. 13. ఆడేపు సిద్ధార్డ్, సెంట్ మేరి కాలనీ, రామగిరి మండలం, పెద్దపల్లి జిల్లాకు చెందినవారు వున్నారు. ప్రస్తుతం పరారీ వున్న నిందితులు: కలకత్తాకు చెందిన 1. ప్రజీత్, 2. సంజీవ్, 3 ప్రకాశ్.

ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఇప్పరాజ్ కుమార్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో అన్లైన్ ద్వారా గిర్లు వచ్చిందని అమాయక ప్రజలను నమ్మించి డబ్బు దోచుకోవాలని మరో ప్రధాన నిందితుడైన తాళ్లపల్లి దామోదర్ గౌడో ప్రణాళికను రూపొందించుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే పోలీసులకు చిక్కతామని, నిందితులు ఈ ఆన్లైన్ మోసాలకు కలకత్తా నగరాన్ని తమ స్థావరంగా ఏర్పాటు చేసుకోని స్థానికంగా వున్న ప్రజీత్, సంజీవ్, ప్రకాశ్. (ప్రస్తుతం వీరు ముగ్గురు పరారీలో వున్నారు) లను తమ అనుచరులగా నియమించుకోని కలకత్తాలోని ఓ అపార్ట్మెంట్లోని గదినుండి వీరి కార్యకలాపాలను 2014 ప్రారంభించారు.

ఇందుకోసం నిందితులు ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ షాపింగ్ చేసిన వారి సెల్ ఫోన్ నంబర్లను సేకరించి సదరు ఆన్లైన్ ద్వారా వస్తువులను కొనుగోలు చేసిన వ్యక్తుల సెల్ ఫోన్లకు ఫోన్ చేసి మీరు ఆన్లైన్ షాపింగ్ చేసినందుకుగాను నిర్వహించిన డ్రాలో మీరు కారుని బహుమతిగా గెలుచుకున్నారని, మీరు గెలుచుకున్న కారును దక్కించుకోవాలంటే ఇందుకోనే రొడ్డు టాక్స్ నిమిత్తం కొద్ది మొత్తంలో డబ్బును బ్యాంకులో జమచేయాల్సిందిగా నిందితులు ఆన్లైన్లో షాపింగ్ చేసిన వ్యక్తులను తెలిపేవారు. అదే విధంగా నిందితులు సదరు ఆన్లైన్ షాపింగ్ చేసిన వ్యక్తి ఇంటి చిరునామాకు డబ్బులు లేదా కారును గిఫ్ట్ గా గెలుచుకున్నారనే విధంగా స్క్రాచ్ కార్డులను రూపొందించిన వాటిని పోస్ట్ చేసేవారు, గిఫ్ట్ కోసం వివరాలను తెలుసుకోనేందుకు వీలుగా గిఫ్ట్ కార్డులోని ఫోన్ నంబర్లకు సంప్రదిస్తే నిజంగానే డబ్బు లేదా కారును బహుమతిని గెలుచుకున్నట్లుగా నిందితులు సమాధానం ఇవ్వడంతో పాటు వీటి పొందేందుకుగాను అవసరమయిన పన్నులు చెల్లించేందుకు నిందితులు ఒక నకీలీ బ్యాంక్ ఖాతాను కుడా తెరిచేవారు.                                                                                                                                                                                                  ఈ విధంగా ఈ ముఠా సభ్యులు రోజుకి 30 నుండి 40 వరకు మంది ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసేవారు. ఇందుకోసం ఈ ముఠా సభ్యులు నకీలీ సెల్ ఫోన్ నంబర్లతో పాటు వినియోగదారులతో మాట్లాడేందుకుగాను పోలీసులు అరెస్టు చేసిన నిందితులను ఈ కాల్ సెంటర్ లో నియమించి ఈ ముఠా ఈ

మోసాలకు పాల్పడుతుండేవారు. ఈ విధంగా మోసపోయిన ఆన్లైన్ వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదులపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇంతేజార్ గంజ్, స్టేషన్ ఘన్‌పూర్, జఫర్ గడ్, గీసుగొండ, ఖానాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులను నమోదు చేసుకోని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి అదేశాల మేరకు సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డి.సి.పి పుష్పా అధ్వర్యంలో టాస్క్ఫ ర్స్ పోలీసులు ప్రస్తుతం వున్న అధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోని నిందితుల కదలికలను గుర్తించి ఈరోజు ఉదయం నిందితులు తిరిగి కొలకత్తకు తిరిగి వెళ్ళే క్రమంలో వరంగల్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో వున్నట్లుగా పోలీసులకు సమచారం అందడంతో స్థానిక టాస్క్ఫర్స్ పోలీసులు, ఇంతేజా గంజ్ పోలీసులు సంయుక్తంగా కలిసి నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నిందితులు పాల్పడిన నేరాలను పోలీసుల విచారణ అంగీకరించారు.

నేరాలను గుర్తించడంతో పాటు పెద్దమొత్తం డబ్బును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డి.సి.పి పుష్పా, టాస్క్ఫ ర్స్ ఇంచార్జ్ ఎ.సి.పి ప్రతాప్ కుమార్, ఇన్ స్పెక్టర్లు శ్రీనివాస్ జీ, మధు,ఇంతేజార్ గంజ్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సైబర్ క్రైం ఇన్ స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి, అసిస్టెంట్ ఆనాటికల్ అఫీసర్ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుళ్ళు శ్యాం సుందర్, సోమయ్య,కానిస్టేబుళ్ళు అలీ, చిరంజీవి, శ్రీకాంత్, సృజన్, శ్రీనివాన్లను పోలీస్ కమిషనర్ అభినందించారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :