contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

జమ్మూకశ్మీర్‌లో ఎన్కౌంటర్ .. బాపట్ల ఆర్మీ జవాను వీరమరణం

 జమ్మూ  కశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన యువ జవాను మనుప్రోలు జశ్వంత్‌రెడ్డి (23) వీరమరణం పొందాడు. రాజౌరీ జిల్లాలోని సుందర్‌బాని సెక్టారులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాల చేతిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే, ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. జశ్వంత్‌రెడ్డి వీరమరణం పొందినట్టు ఆర్మీ అధికారులు ఈ ఉదయం ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ఈ రోజు  రాత్రికి జశ్వంత్ మృతదేహం బాపట్లకు చేరుకునే అవకాశం ఉంది. కాగా, జశ్వంత్‌రెడ్డి 2016లో మద్రాసు రెజిమెంట్‌లో సైన్యంలో చేరాడు.  తొలుత నీలగిరిలో పనిచేసిన జశ్వంత్ ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగు నెలల క్రితం సెలవులపై ఇంటికి వచ్చాడు. మరో నెల రోజుల్లో కుమారుడికి వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతలోనే అతడు అమరుడైన విషయం తెలిసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :