contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

టీ20ల్లో తొలిసారి ఇంగ్లిష్ జట్టుపై విజయం!

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో విజయం సాధించిన బంగ్లాదేశ్ తొలిసారి ఆ ఘనత అందుకుంది. టీ20 ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌పై ఆ జట్టుకు ఇదే తొలి విజయం. చట్‌గావ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్ 42 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

అనంతరం 157 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నజ్ముల్ హొసైన్ 30 బంతుల్లో 8 ఫోర్లతో 51 పరుగులు చేయగా, కెప్టెన్ షకీబల్ హసన్ 34 పరుగులు చేశాడు. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ ఈ నెల 12న ఢాకాలో జరుగుతుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :