contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

ప్రదాని మోడి డిస్టి బొమ్మ దగ్ధం

 

యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారి అధ్వర్యంలో ప్రదాని మోడి డిస్టి బొమ్మ దగ్ధం.

ఈ సందర్భంగా శివసేన రెడ్డి  మాట్లాడుతూ.

ఉగ్రవాదులు, నేరగాళ్ల పనిపట్టేందుకు తయారైన సాఫ్ట్‌వేర్‌ పెగాసస్. కానీ భారత్‌లో మాత్రం ప్రతిపక్షాలు, విలేకరులపై BJP దీని సాయంతో నిఘా పెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో దీనిపై పార్లమెంటులో చర్చకు పెట్టాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారు డిమండ్ చెసారు.ఇజ్రాయెల్‌కు చెందిన టెక్నాలజీ, సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ అభివృద్ధిపరిచిన ఓ సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌ పెగాసస్. స్మార్ట్‌ఫోన్ల నుంచి రహస్యంగా సమాచారం సేకరించేందుకు పనికొస్తుంది.

ఈ మాల్‌వేర్‌ లేదా స్పైవేర్‌ ఉన్న స్మార్ట్‌ఫోన్ల మైక్రోఫోన్, కెమెరా నియంత్రణ ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. కావాలనుకుంటే ఈ–మెయిళ్లు, లొకేషన్‌ డేటాను కూడా సంపాదించొచ్చు.ఆడియో ఫైళ్లను,మెసేజీలను (వాట్సాప్‌ లాంటివి) కూడా పెగసస్‌ ద్వారా వినొచ్చు,చదవొచ్చని యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ తయారుచేసే కాస్పర్‌స్కై నివేదిక చెబుతోంది.

ఇటువంటి భయంకరమయిన వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించే పెగాసస్ ను మోడి ప్రభుత్వం మన దేశంలోని అనేకమంది రాజకీయ నాయకులు, విలేకరులపై ప్రయోగించడం రాజ్యాంగ విరుద్ధం చట్టరీత్య నేరం అని శివసేన రెడ్డి గారు తెలియజేశారు.

దీనిపై వెంటనె సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించి దోషులకు శిక్షించాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారు హైదరాబాద్ బాబు జగ్జీవన్ రావు విగ్రహం వద్ద ప్రదాని నరేంద్రమోడి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :