contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

ప్రారంభం కానున్న పాపికొండల పర్యటన

 ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలోని పర్యాటకులకు ఇది శుభవార్తే. గోదావరిలో విహరిస్తూ పాపికొండల అందాన్ని వీక్షించే అవకాశం మరోమారు దక్కనుంది. దాదాపు 18 నెలల పాటు నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర ఈ నెల 15 నుంచి తిరిగి ప్రారంభం కానుంది.తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం తర్వాత అధికారులు పాపికొండల పర్యటనను నిలిపివేశారు. తాజాగా, ఏపీ పర్యాటకశాఖ బోటుకు జలవనరుల శాఖ అధికారులు అనుమతులు ఇచ్చారు.ఈ క్రమంలో ఈ నెల 15న పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం సింగనపల్లి (కంపెనీ) నుంచి బోటు బయలుదేరుతుందని ఉభయగోదావరి జిల్లాల ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ (కాకినాడ)  టీఎస్ వీరనారాయణ తెలిపారు.పాపికొండల పర్యాటకుల సౌకర్యార్థం త్వరలోనే ఆన్‌లైన్‌లో టికెట్లను ఉంచుతామన్నారు.

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :