contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బిడ్డా గంగులా.. 2023 తర్వాత నీవు ఉండవు: ఈటల తీవ్ర హెచ్చరిక

 

ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఆయనపై ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. విమర్శలు ఎక్కుపెడుతున్న వారిలో మంత్రి గంగుల కమలాకర్ మొదటి వరుసలో ఉన్నారు. ఈటలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు.ఈ నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈరోజ మీడియాతో మాట్లాడుతూ గంగులకు ఈటల తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘బిడ్డా గంగులా… అధికారం ఎవడికీ శాశ్వతం కాదనే విషయం గుర్తుంచుకో’ అని వ్యాఖ్యానించారు.కరీంనగర్ సంపదను విధ్వంసం చేశావని, జిల్లాను బొందలగడ్డగా మార్చావని ఈటల దుయ్యబట్టారు. పైరవీలు చేసుకుని మంత్రి అయిన చరిత్ర నీదని… నీలాంటి చరిత్ర తనది కాదని అన్నారు. నీలాంటి వ్యక్తుల బెదిరింపులకు తాను భయపడనని చెప్పారు. మంత్రిగా ఉన్న తర్వాత సభ్యత, సంస్కారం ఉండాలని అన్నారు. హుజూరాబాద్ ప్రజలను నువ్వు వేధిస్తున్నావంటూ విరుచుకుపడ్డారు. ఈరోజు తనపై విమర్శలు చేస్తున్న నేతలు ఒక్కరోజైనా ప్రజల బాధలను పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు.నువ్వు ఎన్ని ట్యాక్సులు ఎగ్గొట్టావో ఎవరికి తెలియదు? అని ఈటల అన్నారు. నీ కథ మొత్తం తనకు తెలుసని… సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతానని… 2023 తర్వాత నీవు ఉండవని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 2006 ఎన్నికల్లో దివంగత రాజశేఖరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎంత డబ్బు ఖర్చు చేసినా, ఎందరో నేతలను కొన్నా… తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్నే గెలిపించారని అన్నారు. ఇప్పుడు కూడా హుజూరాబాద్ లో అదే జరుగుతుందని చెప్పారు.తాను ఎంతో సంస్కారంతో వ్యవహరిస్తున్నానని… లేకపోతే మాడిమసైపోతారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కు తక్కువ ఓట్లు వస్తే… 54 వేల ఓట్ల మెజారిటీతో హుజూరాబాద్ ఆదుకుందని చెప్పారు. హుజూరాబాద్ ప్రజలను, వారి ఆత్మగౌరవాన్ని ఎవరూ కొనలేరని అన్నారు. తన ప్రజల మీద ఈగ కూడా వాలనివ్వనని చెప్పా.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :