contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

భారత్‌లో కరోనావైరస్ కేసులు – మరణాల సంఖ్య

ఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ కేసులు , మరణాల సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. గత ఆరు రోజుల నుంచి ప్రతీరోజు దేశవ్యాప్తంగా 50వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.  గత 24 గంటల్లో 52,050 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 803 మంది మరణించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,55,745కి పెరిగింది. అంతేకాకుండా మృతుల సంఖ్య 38,938కి చేరింది.దేశంలో ప్రస్తుతం 5,86,298 కరోనావైరస్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 12,30,509 మంది కోలుకున్నారు. ఇదిలాఉంటే.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2కోట్లకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. దేశంలో కరోనా రికవరీ రేటు 66.30 శాతంగా ఉండగా..  మరణాల రేటు 2.1 శాతంగా ఉంది. 
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :