contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఎం.బి ఏ కోర్స్ లో ప్రవేశం

నెల్లూరు జిల్లా: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం వారు జిల్లా లోని ఉద్యోగస్తుల మరియు  వారి ఉద్యోగాలలో  ప్రగతి సాధించుటకు  రెండు సంవత్సరాల కాల  వ్యవధి గల ఎగ్జిక్యూటివ్ ఎం.బి ఏ కోర్స్ ను ప్రవేశపెట్టడమైనది. డిగ్రీ పొంది నేరుగా ఉద్యోగ అవకాశాలు అందుకొని, సరైన పదోన్నతలు పొందలేక పోతున్న అభ్యర్థులు ఈ కోర్స్ ద్వారా నిర్వాహక మరియు నాయకత్వ నైపుణ్యాలను అందిపుచ్చుకోవచ్చని ఉపకులపతి ఆచార్య ఎం చంద్రయ్య విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కోర్స్ గురించి విభాగ అధిపతి డాక్టర్ జె విజేత మాట్లాడుతూ,   ఏ డిగ్రీయినా పాసై ఉండి, ఐదు సంవత్సరాల ఉద్యోగ అనుభవం కలిగి మరియు ఎగ్జిక్యూటివ్  ఆపై హోదాలో పనిచేస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరని తెలిపారు. ఉద్యోగస్తులు  మాత్రమే ఈ కోర్స్ కి అర్హులు కనుక వారి సౌకర్యార్థం తరగతులను సాయంత్రం వేళల్లో మరియు వారాంతపు రోజుల్లో  నిర్వహించబడును. ఆసక్తి గల  అభ్యర్థులు మార్చి  31 వ తేదీ లోగ దరఖాస్తు చేసుకొనవలెను  మరియు దరఖాస్తు రుసుము 1000/- రిజిస్ట్రార్, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పేరున డి.డి ద్వార చెల్లించగలరు. దరఖాస్తుతో పాటు  వారి విద్య మరియు ఉద్యోగ అనుభవం తెలిపే ధ్రువీకరణ పత్రాలను జతచేయగలరు. 

అప్లికేషన్ మరియు కోర్స్ గురించి పూర్తి  వివరాలను తెలుసుకొనుటకు  విశ్వవిద్యాలయం వెబ్సైటు www.simhapuriuniv.ac.in సందర్శించగలరు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :