contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వి యస్ యు లో నూతన తపాలా కార్యాలయని ప్రారంభించిన ఉపకులపతి

 

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నూతన తపాలా కార్యాలయన్ని ఆచార్య ఆర్.సుదర్శన రావు ఈ రోజు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ప్రత్యేకమైన సబ్ పోస్ట్ ఆఫీస్‌ను ప్రారంభించారు. పోస్ట్ కార్డులు, స్టాంపులు, రిజిస్టర్డ్ పోస్ట్, రిజిస్టర్డ్ పార్సెల్ వంటి అన్ని రకాల పోస్టల్ సేవలు రెవెన్యూ స్టాంపుల స్పీడ్ పోస్ట్ సేల్ మొదలైనవి విశ్వవిద్యాలయ పోస్టాఫీసులో అని అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు నెల్లూరు పట్టణానికి వెళ్ళే పరిపాలన, సిబ్బంది మరియు విద్యార్థులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గూడూరు సర్కిల్ పోస్టల్ సర్వీసెస్ సూపరింటెండెంట్,రెక్టర్ ఆచార్య ఎం. చంద్రయ్య గారు,కార్యక్రమంలో భాగంగా రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయ క్రిష్ణ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని విశ్వవిద్యాలయ సిబ్బంది, విద్యార్థులు, మరియు సామాన్య ప్రజలు అందరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సాయి ప్రసాద్ రెడ్డి గారు, జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ అల్లం ఉదయశంకర్, పోస్టల్ ఇన్స్పెక్టర్ సాయి కృష్ణ, మరియు పోస్టల్ సిబ్బంది, విశ్వవిద్యాలయ బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :