contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

షూటింగులకు అనుమతించాలని తలసానిని కోరిన టీవీ ఛానళ్ల ప్రతినిధులు – నిబంధనలను పాటిస్తూ షూటింగులు నిర్వహిస్తాం

లాక్ డౌన్ కారణంగా సినిమా, సీరియళ్లతో పాటు టీవీ ఎంటర్ టైన్మెంట్ ప్రోగ్రాముల షూటింగులు కూడా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పలు ఛానళ్ల ప్రతినిధులు కలిశారు.లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్ల వద్దే ఉంటున్నారని… వారికి ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు షూటింగ్ లకు అనుమతించాలని ఈ సందర్భంగా మంత్రిని ఛానళ్ల ప్రతినిధులు కోరారు. ఈమేరకు వినతిపత్రం అందించారు. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ షూటింగ్ లను నిర్వహిస్తామని చెప్పారు. వారి విన్నపంపై సానుకూలంగా స్పందించిన తలసాని… ఈనెల 5న సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :