contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సెమిస్టర్‌ విధానాన్ని స్కూళ్లలోనూ అమలు చేయాలని కేంద్రం ఆలోచన

పూర్వప్రాథమిక విద్యలో నాణ్యత ఉండటం లేదని , అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని ఈ విధానం సూచించింది . చాలామంది విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో చదవడం , రాయడం రావడం లేదని , చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది . పాఠశాల విద్యలో మొదటి మూడేళ్లు పూర్వ ప్రాథమికవిద్యతో పాటు 1, 2 తరగతులు , తర్వాత మూడేళ్లలో 3-5 తరగతులు , అనంతరం మూడేళ్లు 6-8 తరగతులు , నాలుగేళ్లలో ఉన్నత పాఠశాల 9-12 తరగతులు ఉంటాయి . మొదటి ఐదేళ్ల పునాది స్థాయిలో విద్యార్థులకు మంచి ప్రవర్తన , నైతికత , వ్యక్తిగత పరిశుభ్రత , పరస్పర సహకార విధానం బోధించాలని ఈ కొత్త విద్యావిధానం చెబుతోంది . మరి ఈ విధానాన్ని రాష్ట్రాలు పాటిస్తాయా .. ఆ మేరకు మార్పులు చేస్తాయా అన్నది ఆయా రాష్ట్రప్రభుత్వాలపై ఆధారపడి ఉంటుంది .పాఠశాల విద్యలోనూ రాబోతోంది . సెమిస్టర్‌ విధానాన్ని స్కూళ్లలోనూ అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది . కేంద్రం రూపొందించిన జాతీయ విద్యావిధానం -2020 నివేదిక ఈ విషయాన్నే రికమెండ్ చేసింది .

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :