contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వ్యభిచార గృహంపై దాడి ముగ్గురు అరెస్ట్

వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ డిసిపి టాస్క్ ఫోర్స్ సూచనల మేరకు రెడ్డి కాలనీ, హనుమకొండలో ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను, విటుడులను టాస్క్ ఫోర్స్, హన్మకొండ పోలీసులు సంయుక్తంగా రైడ్ నిర్వహించి మంగళవారం అరెస్టు చేశారు. డాక్టర్ ఎం. జితేందర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ ఏసిపి తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ జిల్లా రెడ్డి కాలనీకు చెందిన ఒక మహిళ ఇల్లు కిరాయికి తీసుకొని ఇతర రాష్ట్రాల అనగా వెస్ట్ బెంగాల్ నుండి మహిళలను రప్పిచ్చి గత సంవత్సరం నుండి అత్యంత రహస్యంగా ఎవరికి అనుమానం రాకుండా సులభంగా డబ్బులు సంపదిచలని వ్యభిచారం చేయిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో జీవన్ నగర్, శ్యాంపెట్ కు చెందిన విటులు 1. మరిపెల్లి స్టేపెన్, 2. మరిపెల్లి.
పీటర్ లు మహిళతో ఒప్పందము కుదిర్చి వ్యభిచారం చేయిస్తున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్, హన్మకొండ పోలీసులు రైడ్ చేసి బాధిత ఇద్దరు మహిళలను కాపాడి, నిర్వాహకురాలు అయినా కుతాటి. నందిని నివాసం రెడ్డి కాలనీ, హనుమకొండ, విటులు 1. మరిపెల్లి. స్టేపెన్, 2. మరిపెల్లి. పీటర్ లను తదుపరి విచారణ నిమిత్తం హన్మకొండ పోలీసులకు అప్పగించదమైనదని తెలిపారు. డాక్టర్ తరుణ్ జోషీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ,, ఎవరైనా ఆర్గనైజ్డ్ గా ఏర్పడి మహిళలతో వ్యభిచారం చేయించినట్లయితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడునని, ఇదే వృత్తిగా చేసుకొని రూములు తీసుకొని వ్యభిచారం చేస్తూ పదే పదే దొరికిన నిర్వాహకులపై పిడి చట్టము అమలు చేయబడునని హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :