contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

26న భారత్ బంద్.. మావోయిస్టు పిలుపు

 

ఏప్రిల్  26న దేశవ్యాప్త బంద్‌కు సీపీఐ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి కైలాసం పేరుతో ఓ లేఖ విడుదలైంది. చత్తీస్‌గఢ్‌లో ప్రహార్-3 పేరుతో ఆదివాసీలు, మావోయిస్టు ఉద్యమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేత ధోరణి అవలంబిస్తున్నాయని, దీనికి వ్యతిరేకంగా ఈ నెల 26న దేశవ్యాప్త బంద్ నిర్వహిస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ, ఒడిశా ముఖ్యమంత్రులు జగన్, నవీన్ పట్నాయక్ మావోయిస్టు ఉద్యమాన్ని సమూలంగా నిర్మూలించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో నిర్బంధకాండ కొనసాగుతోందని కైలాసం ఆ లేఖలో ఆరోపించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :