contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

48 గంటలు టైమ్ ఇస్తున్న .. అధికారులకు బండి సంజయ్ హెచ్చరిక

గోదావరిఖని పట్టణం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని గోదావరిఖనిలో డివైడర్ పైన ఉన్న రోడ్డు పక్కన ఉన్న దారి మైసమ్మ గుడిలను కూల్చివేత రాష్ట్ర వ్యాప్తంగా హార్ట్ టాపిక్ గా మారింది గోదావరిఖని పట్టణం మొత్తం 46 ఆలయాలను అధికారులు తొలగించారు బుధవారం అర్ధరాత్రి దొంగ చాటుగా ప్రారంభమైన ఆలయాల కూల్చివేతలు గురువారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి ఈ నేపథ్యంలో దారి మైసమ్మ ఆలయాల కూల్చివేతలు పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరియస్ అయ్యారు ఈ సందర్భంగా ఆయన ఈరోజు హైదరాబాద్ లో మీడియా తో మాట్లాడుతూ 46 దారి మైసమ్మ ఎలా కూల్చివేస్తారు అని ఆయన ప్రశ్నించారు అయితే రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను ఎందుకు ఎందుకు వదిలేశారు అని ధ్వజమెత్తారు హిందూ దేవాలయాలు అంటే అంత చిన్న చూపు హా అంత చులకనా ఎంత ధైర్యంమని కామెంట్ చేశారు అధికారులకు 48 గంటలు టైమ్ ఇస్తున్నానని కూల్చిన అన్ని దారి మైసమ్మ ఆలయాలను తిరిగి కంట్టించాలి అని హెచ్చరించారు లేని పక్షం లో రోడ్డు అడ్డంగా ఉన్న మసీదులను కూడా కూల్చివేయాల్సిందే నని అన్నారు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు అవ్వగానే గోదావరిఖని కే నని అధికారుల సంగతి తేలుస్తానని అని వార్నింగ్ ఇచ్చారు దారి మైసమ్మ ఆలయాలను కట్టించకపోతే తానే రోడ్డు అడ్డంగా ఉన్న మసీదుల అన్నింటినీ. తానే కూల్చి వేయిస్తానని అని అన్నారు. జరిగిన ఘటన పై ఆయన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ కోయ హర్ష రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణ శ్రీ లకు ఫోన్ చేసి ఇతరుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :