contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం .. భారత యాత్రికుల సజీవ దహనం

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది భారత యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగి వారంతా సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరణించిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందినవారే ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.

వివరాల్లోకి వెళితే, పవిత్ర మక్కా యాత్రను ముగించుకుని యాత్రికులు బస్సులో మదీనా నగరానికి బయలుదేరారు. ఈ క్రమంలో వారి బస్సును ఎదురుగా వస్తున్న డీజిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద తీవ్రతకు బస్సులో ఉన్న ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. ఈ దుర్ఘటనలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు సహా మొత్తం 42 మంది అక్కడికక్కడే మరణించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.

ప్రమాద విషయం తెలియగానే సౌదీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విషాద ఘటనతో వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :