contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కొట్నపల్లి నల్ల రాయి క్వారీ శాశ్వతంగా నిలిపివేయాలి..!

  • గిరిజన ప్రజలకు … అధికారులు న్యాయం చేయాలి
  • జనసైనికుడు నైని సత్తిబాబు డిమాండ్

 

అల్లూరి జిల్లా హుకుంపేట :  హుకుంపేట మండలం కొట్నపల్లి పంచాయతీ లో ఉన్న నల్లరాయి క్వారీని నిలిపివేయాలని ప్రజలు ఏడాది నుండి డిమాండ్ చేస్తున్నారు, క్వారీ వల్ల పర్యావరణానికి హాని కలుగుతోందని, ప్రజల జీవనోపాధి దెబ్బతింటోందని వారు ఆందోళన చేస్తున్న అధికారులు పట్టించుకోకుండా వుండటం చాలా బాధాకరమని ప్రజలకు అండగా ఉండకుండా గిరిజనేతరుడు అయిన క్వారీ యజమానులకు అండగా ఉండటం సరికాదని కొట్నపల్లి నల్ల రాయి క్వారీ నీ శాశ్వతంగా నిలిపివేయాలని జన సైనికుడు నైని సత్తిబాబు డిమాండ్ చేశారు. క్వారీ తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. గాలి, నీరు కలుషిత మవుతాయి. క్వారీ నుంచి వెలువడే దుమ్ము, ధూళి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని నైని సత్తిబాబు పేర్కొన్నారు.క్వారీ వల్ల రైతుల పండించే పంటలు దెబ్బతింటున్నాయి. కొంతమంది రైతులు మిరియాలు ,కాఫీలు , వరి పంటలు దిగుబడి రాక తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో వారి జీవనోపాధి దెబ్బతింటోంది. అమాయక గిరిజన ప్రజలకు అండగా వుండాల్సిన అధికారులే ఎటువంటి హక్కు లేని క్వారీ యజమానులకు మద్దదు గా వుండటం బాధాకరం అన్నారు. ఎన్ ఎచ్ 516ఈ నిర్మాణం పూర్తి అయిందని మీ లాభాలు గురించి బయటకు అమ్మకాలు జరుగుతున్నాయని తవ్వకాలు శాశ్వతంగా ఆపాలని కొట్నపల్లి నల్ల రాయి క్వారీ అక్రమ మైనింగ్ జరుగుతోందని, నిబంధనలు పాటించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. క్వారీకి సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, సరైన చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ కారణాల వల్ల, కొట్నపల్లి ,తాడిపుట్టు పంచాయతీల బాధిత గ్రామాల ప్రజలకు క్వారీ శాశ్వతంగా నిలిపివేసి అమాయక గిరిజన ప్రజలకు న్యాయం చేయాలని లేకుండా ప్రజలు తో పాటి భారీ ఉద్యమం చేస్తామని జనసైనికుడు నైని సత్తిబాబు హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :