- 80% శాతం కాఫీ ,మిరియాలు , దిగుబడి తగ్గింది.
- జిల్లా అధికారులు బాధిత గ్రామాలను సందర్శించాలి.
- మండల రైతు అధ్యక్షుడు మాతె అప్పలకొండ
అల్లూరి జిల్లా హుకుంపేట : మండలంలో కొట్నాపల్లి పంచాయతీ పరిధిలో గల నల్ల రాయి క్వారీ నిలుపుదల చేసి భాధిత గ్రామాల ప్రజలకు , వ్యవసాయ రైతులకు అండగా జిల్లా అధికారులు ఉండాలని మండల రైతు అధ్యక్షులు మాతే అప్పాలకొండ కోరారు. ఈ సందర్బంగా మాతె అప్పల కొండ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా గిరిజనులకు జరిగే అన్యాయాలు, వారికున్న హక్కులకై పనిచేస్తూ ఉంటుందని పేర్కొన్నారు. భాధిత గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం అమాయక గిరిజన రైతులు పండించే పంట పొలాలు, మిరియాలు కాఫీలు , దిగుబడి 80 % పడిపోయిందని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఇంత జరుగుతున్న నల్ల రాయి క్వారీ నీ నిలిపి వేయకుండా అధికారులే మద్దతు గా వుండటం బాధాకరమని , గిరిజన రైతులకు అన్యాయం చేయడం సరికాదని క్వారీ నిలిపి వేయాలననీ,నష్ట పోయిన రైతులకు బాధితులకు న్యాయం చేయని మండల రైతు అధ్యక్షులు మాతే అప్పాలకొండ సోమవారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఎన్ ఎచ్ 516 ఈ నిర్మాణం కొరకు తాత్కాలిక క్వారీ ఏర్పాటు చేసి దాని ఇప్పుడు చుట్టూ పక్కల ఉన్న మారుమూల ప్రాంతాలు కు సరఫరా చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. గడువు పూర్తి కావడం తో తప్పు దారిలో అవసరమైన పత్రాలను సృష్టించి క్వారీ తవ్వకాలు నిర్వహించడం, భాదితులను భయబ్రాంతులకు గురి చేసినట్టు స్వయంగా గ్రామస్తులు మీడియా ద్వారా తెలియజేశారు. ఈ మేరకు గ్రామస్తులు జిల్లా అధికారులకు వినతి పత్రాలు కూడా ఎన్నో సార్లు అందించిన ప్రయోజనం లేదని గిరిజన ప్రజలు ఎన్ని ఇబ్బందులు అధికారులకు తెలియజేసిన ప్రయోజనం లేదని ప్రజలకు అండగా వుండాల్సిన అధికారులే గిరిజనేతరుల అయినా క్వారీ యజమానులకు అండగా వున్నారని ఆరోపించారు . జిల్లా అధికారులు భాదితుల గ్రామాలను ఇళ్లను పర్యటించి అమాయక గిరిజన ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని మాతె అప్పాలకొండ వేడుకున్నారు