అమరావతి, తాడేపల్లి: సౌర దీప్ చౌదరి మృతి మరవకముందే KLU లో మరో విద్యార్ధి ఆత్మహత్య జరగడం సంచలనాన్ని రేకెత్తిస్తుంది. వారంలో ఇది రెండో దుర్ఘటన. ర్నూల్ జిల్లా లక్ష్మీపురం కు చెందిన బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న గడ్డం ప్రదీప్ రెడ్డి అనే విద్యార్థి బాయ్స్ హాస్టల్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీలో జాయిన్ అయిన పది రోజులకే ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. విద్యార్థుల ఆత్మహత్యలపై కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తుందని పలు విమర్శలు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ఆత్మ హత్యలకు గల కారణాలను అధ్యయనం చేసేందుకు కమిటీ వేయాలని కోరుతున్నారు బాధిత కుటుంబాలు.
