అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన ర్ల భవనంలో పెన్షన ర్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్ అబూబాకర్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, అదనపు కార్య దర్శి జెన్నే కుల్లాయి బాబు ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ దేవరాయలు జయంతి వేడుకలునిర్వహించారు. ముందుగా శ్రీ కృష్ణ దేవరాయలు చిత్ర పటానికి పులా మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలన గూర్చి కొనియాడుతూ, తులవ వంశానికి చెందిన విజయ నగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు తన ఇరవై సంవత్సరా ల వయసులోనే విజయ నగర సింహాన్ని ఆధిష్టించారు. కృష్ణదేవరాయలు ఆంధ్ర, కర్ణాటక, రాష్ట్రాలను పరిపాలించిన గొప్ప చక్రవర్తిగా, ఆంధ్ర భోజుడుగా, సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా కీర్తించ బడినారు. కటకం వంటి గొప్ప రాజ్యాలను యుద్ధంలో గెలిచి తన గజ బలాన్ని పెంచుకుని శత్రు రాజులను బయ కంపితులను చేసారు. అష్ట దిగ్గజ కవులను తన కొలువు లో నిలిపిన సాహిత్య సార్వభౌముడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ రామ్ మోహన్, కోశాధికారి ఫక్రుద్దీన్,వెంకటేష్ లు,షైక్షా వళి,శామ్యూల్, గోవిందప్ప, నారాయణ శెట్టి, చెన్నారెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
