అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోభారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద ఇంటి నివాస స్థలాలకై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, నియోజకవర్గ కార్యదర్శి వీరభద్ర స్వామి, పట్టణ మండల కార్యదర్శిలు రాజు, రామదాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా పట్టణాలలో రెండు సెంట్లు గ్రామాలలో మూడు సెంట్లు ఇంటి స్థలము వెంటనే కేటాయించాలని లేనిపక్షంలో తీవ్రతరంగా ధర్నాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సిపిఐ సహాయ కార్యదర్శి రమేష్, మండల సహాయ కార్యదర్శులు మధు, నరసింహయ్య రైతు సంఘం అధ్యక్షులు వెంకట్రాముడు, పట్టణ సహాయ కార్యదర్శి నజీర్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నియోజకవర్గ నాయకురాలు మహమూద, మండల నాయకురాలు మాబి, సీనియర్ నాయకుడు షఫీ, డానియల్, వెంకటేష్, తదితరులు పాల్గొనడం జరిగింది .
