అనంతపురం జిల్లా గుత్తి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి వైయస్సార్సీపి పై తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఈ సందర్భంగా పత్రికా ప్రకటన విడుదల చేస్తూ వెన్నుపోటు దినమంటూ కొత్త నాటకానికి జగన తెర లేపరన్నారు . ఐదేళ్లు ప్రజలకు చేసిన మోసానికి జగన్ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.జూన్ 4న వైసీపీ నేతలు పశ్చాతాప దినంగా జరుపుకోవాలి, కూటమి ప్రభుత్వ పాలన చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. అలవాటు ప్రకారం అసత్యాల ప్రచారమే జగన్ పనిగా పెట్టుకున్నారు అని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోని వ్యవస్థల్ని గాడిన పెట్టారు. చెల్లిళ్లకే వెన్నుపోటు పొడిచిన జగన్ను ప్రజలు నమ్మట్లేదు, ఇదే వైఖరితో కొనసాగితే వైసీపీ పరిస్థితి గుండుసున్నానే అని తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం లో ఆగిపోయిన ఆంధ్రుల రాజధాని అమరావతికి శ్రీకారం చుట్టామన్నారు స్వర్గీయ ఎన్టీఆర్ ప్రారంభించిన వృద్ధాప్య పింఛన్లను, 4000 రూపాయలకు పెంచి నారా చంద్రబాబు నాయుడు అవ్వ తాతలు ఆత్మగౌరవంతో జీవించేలా చేశారన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గడిచిన ఏడాది కాలంలో దేశానికి పట్టుకొమ్మలైన పల్లె పల్లెల్లో రోడ్లు డ్రెయిన్లు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కృషితో గుత్తి మున్సిపాలిటీలో ఐదు సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేసిన ఏఐబి వాటర్ స్కీమ్ ని తిరిగి పట్టాలెక్కించారన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని వారు తెలిపారు.
