అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో నియోజకవర్గం శాసన సభ్యులు గుమ్మనూరు జయరాం మరియు సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి స్థానిక ఆలూరు రోడ్డు లో గల గాయత్రి ఫంక్షన్ హల్ ఎదురుగా నూతన డ్రైనేజీ కాలువ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 30వ వార్డు లో మూడు కాలనీలకు డ్రైనేజీ కాలువలు లేక చాలా అసౌకర్యంగా ఉందని స్థానిక ప్రజలు తెలపడంతో పది లక్షల వ్యయం తో డ్రైనేజీ కాలువ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. ఈకార్యక్రమంలో గుంతకల్లు పట్టణ మరియు మండలం కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
