అనంతపురం జిల్లా గుత్తి పట్టణం ఆర్ అండ్ బి అతిథి గృహము వద్ద ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఏర్పడి ఒక సంవత్సరం అయినా సందర్భంగా టిడిపి పట్టణ మండల కన్వీనర్లు ఎంకే చౌదరి బద్రివల్లి ఆధ్వర్యంలో కేకు కత్తిరించి ఒకరినొకరు తినిపించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ మరియు గుంతకల్లు నియోజకవర్గం శాసన సభ్యులు గుమ్మనూరు జయరాం నేటితో ప్రమాణ స్వీకారం చేసి ఒక సంవత్సరం అయినది. గడిచిన అయిదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం నియోజకవర్గంలో ఏటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు అన్నారు. నేడు కూటమి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కృషితో 8 కోట్ల 64లక్షల పనులకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో కేశవ నాయుడు, పత్రాల రామకృష్ణ,ఎర్రగుడి రమేష్, నగదాని జయన్న, మాతాంగి నారాయణ, ఆర్ఎస్ నాగరాజు, బాలకృష్ణ, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
