అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద స్థానిక మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నిర్మల గారు మాట్లాడుతూ గుత్తి మున్సిపాలిటీలోని బీసీ కాలనీ మరియు z వీరా రెడ్డి కాలనీ లో మెయిన్ రోడ్లు లేనందున సామాన్య ప్రజలు ఎంతో అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రమాదాలకు గురవుతున్న ఈ రెండు కాలనీలలో తక్షణమే మెయిన్ రోడ్లు నిర్మించి సమస్యను పరిష్కరించాలని, అదేవిధంగా గుత్తి గర్ల్స్ హైస్కూల్ ఆవరణలో మెయిన్ రోడ్ నందు స్పీడ్ బ్రేకర్ లేనందున బాలికలు,విద్యార్థినీలు ప్రమాదాలు గురి కాకుండా ఉండడానికి వెంటనే స్పీడ్ బ్రేకర్లు వేయాలని అదేవిదంగా గుత్తిలోని పలు వార్డులలో ఇప్పటికీ మంచినీటి సమస్యతో సామాన్య ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారని తక్షణమే మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రామకృష్ణ, రేణుక,మల్లికార్జున, ,డివైఎఫ్ఐ నాయకులు అశోక్, చందు, రేవతి, కవిత మరియు సిపిఎం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
