అనంతపురం జిల్లా గుత్తి పట్టణం కోటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెబ్ టెక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీ ప్రతినిధి రాజీవ్ చేతుల మీదుగా 30 కంప్యూటర్లను వితరణ చేశారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన గుంటకల్ రైల్వే డి.ఆర్.ఎం చంద్రశేఖర్ గుప్తా, గుత్తి రైల్వే సీనియర్ డి.ఎం.ఇ. ప్రమోద్, డి.వై.ఈ.ఓ.శర్మ రెడ్డి లు కంప్యూటర్ ల్యాబ్ ను మరియు ఒకేషనల్ ఫుడ్ ల్యాబ్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంప్యూటర్ సాంకేతికతను విద్యార్థి దశ నుండి అందిపుచ్చుకోవాలన్నారు. భవిష్యత్తులో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కంప్యూటర్ పరిజ్ఞానముతో ముడిపడి ఉంటుంది. కాబట్టి విద్యార్థినీ విద్యార్థులు విద్యతోపాటు, సాంకేతిక పరిజ్ఞానం పట్ల మెరుగైన తర్ఫీదు పొందాలన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబంలో బాల బాలికలకు కంప్యూటర్ విద్యను వెబ్ టెక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ కంపెనీ వారు చెంతకు చేర్చడం అభినందనీయం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రవి నాయక్, ప్రధానోపాధ్యాయుడు సుభాన్ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
