అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని 9వ సచివాలయ పరిధిలో గల అనంతపురం రోడ్డు నందు ఉన్న రేషన్ షాప్ నెం :7 లో డోర్ డెలివరీ పథకాన్ని స్థానిక తాసిల్దార్ పుణ్యవతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని రేషన్ డీలర్లు అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఐదు రోజుల ముందే 65 ఏళ్లు దాటిన వృద్ధులకు, వికలాంగులకు చేపట్టిన రేషన్ డోర్ డెలివరీ పథకాన్ని సక్రమంగా ఇళ్ల వద్దకే పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ హనుమాన్ ప్రసాద్, విఆర్ఓ చంద్రకళ, డీలర్ అబ్దుల్ సుభన్ పాల్గొన్నారు.
