అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద నుండి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ సర్కిల్, గాంధీ సర్కిల్, రాజీవ్ గాంధీ సర్కిల్ గుండా ఉన్నత పాఠశాల, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు, డ్వాక్రా మహిళలు తో పెద్ద ఎత్తున డ్రగ్స్ వద్దు బ్రో.. ఆరోగ్యం ముద్దు బ్రో.. అంటూ నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తహసిల్దార్ పుణ్యవతి, మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాలకు, గంజాయి వంటి మాదకద్రవ్యాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలిపారు. మత్తు కలిగినటువంటి ఏది స్వీకరించిన చావును స్వీకరించినట్టే, ప్రాణాలతో చెలగాటం వద్దన్నారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా, తల్లిదండ్రుల ప్రేమలకు దగ్గరగా ఉంటూ కుటుంబ బాధ్యతను స్వీకరించాలన్నారు. మాదకద్రవ్యాలకు ప్రేరేపించే వ్యక్తులను దూరంగా ఉంటూ, మాదకద్రవ్యాలను వాడకుండా, ఇతరులను వాడని ఇవ్వకుండా చైతన్యవంతులను చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్స్ చంద్రశేఖర్, ప్రసన్న బాబు, ప్రధాన ఉపాధ్యాయుడు సుంకన్న, ఏఎస్ఐ లు ఆజాద్, మాణిక్యం, మెప్మా సిబ్బంది, డ్వాక్రా మహిళలు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
