contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

17న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : ఎమ్మార్పీఎస్

గుత్తి, అనంతపురం జిల్లా:  గుత్తి ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నవంబర్ 17న జరగబోయే “చలో ఢిల్లీ” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా నాయకుడు ఎన్. వీరన్న పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కరపత్రాలను ఆవిష్కరించారు.

వీరన్న మాట్లాడుతూ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్పై జరిగిన దాడికి పాల్పడిన వ్యక్తిపై ఇప్పటివరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మండల వ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి బయలుదేరి నిరసన తెలపాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు సత్య, చలపతి, అయ్యప్ప, ఓబులేసు, లక్ష్మన్న, లక్ష్మీనారాయణ, రూపేష్, సూర్యనారాయణ, ఓబయ్య, నగేష్, వెంకటేష్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :