అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో హెచ్పీవీ (HPV) వ్యాక్సిన్పై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ తన స్థానిక నివాసంలో ఈ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ నటుడు Allu Arjun అభిమానులు ఆధ్వర్యంలో నిర్వహించడం విశేషం.
కార్యక్రమం ప్రారంభంలో అల్లు అర్జున్ అభిమానులు వాసగిరి మణికంఠకు మొక్కను బహుకరించి, శాలువాతో సత్కరించారు. అనంతరం హెచ్పీవీ వ్యాక్సిన్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ, 14 ఏళ్లు నిండిన బాలికలు హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ను నివారించవచ్చని చెప్పారు. భవిష్యత్ భారత మహిళల ఆరోగ్య రక్షణకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలకు మద్దతు అందిస్తున్న అల్లు అర్జున్ మరియు వారి అభిమానులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ ఫాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు రవికుమార్, జిల్లా సెక్రటరీ నాసిర్, అభిమాన సంఘం నాయకులు వెంకీ, హరీష్, మురళి, జాన్, భీమా, నిఖిల్, రూపేష్, షరీఫ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









