అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పామిడి పట్టణం నందు 20వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజులలో సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తూ మెగా డిఎస్సీ అన్న కాంటీన్లు లాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు 1వ తేదీనే పెంచిన పించన్లు ఉద్యోగులకు జీతాలు అందజేత వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు. ప్రజల ఆకాంక్షళకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సంక్షోభంలోను సంక్షేమం సాధించి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకునేలా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పామిడి టిడిపి ఇన్చార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ తో పాటు ప్రభుత్వ సిబ్బంది సచివాలయ సిబ్బంది ఎన్ డి ఏ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
