అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ బర్దివాలి ఆధ్వర్యంలో కరపత్రాలు ఇంటింటికి అతికిస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ గత వైసీపీ ప్రభుత్వం వంద రోజుల్లో కేవలం 250 రూపాయలు పింఛన్ పెంచారని కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే పెంచిన పింఛన్ మొత్తాన్ని 7000 రూపాయలు అందించి మాట నిలబెట్టుకున్నారు. గతంలో పంచాయతీలను నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వం నేడు కూటమి ప్రభుత్వంలో పంచాయతీలకు నిధులు విడుదల చేయడం గత ప్రభుత్వం కొనుగోలు చేసిన దాన్యానికి బకాయిలు చెల్లించి రైతులను ఆదుకోవడం, ఈ దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుందని బేతాపల్లి గ్రామ ప్రజలకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు పల్లా సాంబశివ యాదవ్, మాజీ ఎంపీటీసి గోవర్ధన్ గౌడ్, మాజీ సర్పంచ్ నాగేంద్ర, కొత్తపల్లి రామాంజి, బోయ గడ్డ రాముడు, బోయ గడ్డ నాగరాజు, స్టోర్ డీలర్ నాగరాజు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.