అనంతపురం జిల్లా గుత్తి పట్టణ మరియు మండల ప్రజలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఐ మరియు సిబ్బంది. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ సంవత్సర వేడుకలు నిబంధనల మేరకే నిర్వహించుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో కేక్ కోయడం, బాణసంచా పేల్చడం, గుంపులుగా చేరి అల్లరి చేయడం వంటి వాటికి అనుమతులు లేవు. సాంప్రదాయ కార్యక్రమాలకు మాత్రమే ముందుగా అనుమతి తీసుకోవాలి. మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి సంబరాలు చేసుకోవడం, ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తీసేసి నడపడంపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించి కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తాము. కావున గుత్తి పట్టణ ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించి ఎలాంటి అనివార్య సంఘటనలు జరగకుండా సంతోషంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని తెలిపారు.
