సిద్దిపేట జిల్లా: బెజ్జంకి మండల కేంద్రంలో అధికార పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడాన్ని బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలలో రుణమాఫీ చేశారా అని పార్టీ మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి ప్రశ్నించారు. తధానంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఒగ్గు దామోదర్, శనగొండ శ్రావణ్, సోమ రాంరెడ్డి, శీలం నర్సయ్య సోషల్ మీడియా ఇంచార్జ్ ధోని వెంకటేశ్వరరావుతదితరులు పాల్గొన్నారు.
