- క్రమబద్ధీకరణ జీవో జారీచేయాలని ప్రధాన డిమాండ్
నిజామాబాద్ జిల్లా: బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండల్ ఎంపీడీవో కార్యాలయం జూనియర్ పంచాయితీ కార్యదర్శుల సమ్మె ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమ్మె శాంతియుతంగానే ఉంటుందని , ప్రభుత్వానికి ఏమాత్రం వ్యతిరేకం కాదు నాలుగేళ్ల శిక్షణ కాలం పూర్తవడంతో ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని అలాగే ఓపి ఎస్ లను జిపిఎస్ లాగా క్రమబద్ధీకరించాలని వారు కోరారు ,
ప్రజా ప్రతినిధులు అందరూ సహకరించి తమ డిమాండ్లను సర్కారు దృష్టికి తీసుకువెళ్లాలి తెలిపారు,అసెంబ్లీ సాక్షిగా సీఎం మూడు సంవత్సరాల తర్వాత జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరేషన్ చేస్తామని హామీ ఇచ్చారు, కానీ ఇప్పటికీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది, రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న సమ్మెకు స్పందించి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు, ఇప్పటికైనా కేసీఆర్ అర్థం చేసుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు.