contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నోయిడాలో సూపర్ టెక్ ట్విన్ టవర్స్ ఇలా నేలమట్టం

ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో నిబంధనలు పాటించకుండా నిర్మించిన సూపర్ టెక్ ట్విన్ టవర్స్ అపెక్స్, సియాన్ నేలమట్టం అయ్యాయి. ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు అధికారులు ఈ టవర్స్ ను కూల్చివేశారు. అందుకోసం 3,700 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించారు. 100 మీటర్ల దూరం నుంచి బటన్ నొక్కగా… కేవలం 9 సెకన్ల వ్యవధిలోనే ఈ ట్విన్ టవర్స్ కుప్పకూలాయి. ప్రైమరీ బ్లాస్ట్ కు 7 సెకన్ల సమయం పట్టగా, సెకండరీ బ్లాస్ట్ 2 సెకన్ల సమయం తీసుకుంది.

ఈ జంట భవనాలు కూలిపోగా ఎగిసిన ధూళి కొన్ని వందల మీటర్ల వరకు వ్యాపించింది. కాగా, ఈ ట్విన్ టవర్స్ చుట్టు పక్కల భవనాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించిన సంగతి తెలిసిందే.

2009లో సూపర్ టెక్ లిమిటెడ్ కంపెనీ ఈ ట్విన్ టవర్స్ ను రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాతిపదికన నిర్మించింది. ఇందుకు గాను రూ.70 కోట్ల వ్యయం అయింది. మూడేళ్లలో ఈ టవర్స్ నిర్మించారు. ఈ జంట టవర్స్ లోని అపెక్స్ టవర్ ఎత్తు 102 మీటర్లు కాగా, ఇందులో 32 అంతస్తులు ఉన్నాయి. సియాన్ టవర్స్ ఎత్తు 95 మీటర్లు. ఈ రెండు టవర్లలో 915 ఫ్లాట్లు, 21 షాపింగ్ కాంప్లెక్స్ లు ఉన్నాయి.

అయితే నిబంధనలను ఉల్లంఘించి ఈ టవర్స్ కట్టారంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, టవర్స్ ను కూల్చేయాలంటూ గతేడాది తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే నేడు నోయిడా ట్విన్ టవర్స్ ను కూల్చివేశారు.

కుతుబ్ మినార్, ఇండియా గేట్ కంటే ఎత్తయిన ఈ భారీ టవర్స్ ను కూల్చివేసేందుకు అధికారులు రూ.20 కోట్లు ఖర్చు చేశారు. శిథిలాల తొలగింపునకు మరో రూ.13.5 కోట్లు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :