రాజన్న సిరిసిల్ల జిల్లా: బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నందున భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగినది. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9 సంవత్సరాలకే దశాబ్ది ఉత్సవాల పేరుతో అంగులు ఆర్భాటాలతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆగ్రహించారు. ఏం సాధించామని దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇచ్చిన హామీలను పక్కనపెట్టి అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేస్తుంది అని అన్నారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తాను అన్న కెసిఆర్ దళిత ముఖ్యమంత్రి ఎక్కడ అని ప్రశ్నించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఎక్కడ అన్నారు. దళిత బంధు ఎన్ని కుటుంబాలకు అందజేసారు అన్నారు. డబుల్ బెడ్ రూమ్ జాడలేదు అన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గ్రామ పంచాయతీల అభివృద్ధికి పాటుపడితే ఓర్వలేని కెసిఆర్ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ మోడీ పాలనలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్రానికి చేయూతనిస్తూ రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉన్నది అని అన్నారు. రానున్న రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ బిజెపి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని రెట్టింపు దిశతో అభివృద్ధి లో నడిపించే సత్తా బిజెపి ప్రభుత్వానికి ఉన్నది అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి తిప్పారపు శ్రావణ్,బిజెపి రాష్ట్ర నాయకులు మేకల మల్లేశం, మండల అధికార ప్రతినిధి పున్ని రాజు, యువమోర్చా మండల అధ్యక్షుడు పున్ని సంపత్, ఓబిసి మోర్చ మండల అధ్యక్షుడు సోదరుల కిషన్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లారం ప్రసన్న, ఓబీసీ జిల్లా కోశాధికారి చెప్యాల గంగాధర్,దళిత మోర్చా మండల ప్రధాన కార్యదర్శి మామిడి శేఖర్, మండల ఉపాధ్యక్షుడు కట్కూరి తిరుపతి, ఎలక వర్ధన్, నాయకులు వజ్జపల్లి శ్రీకాంత్, అంతటి వేణు, గడ్డం చింటూ తదితరులు పాల్గొన్నారు.
