- ఎస్టీ ఎంపీపీపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలి
- ఎంపీపీ ల సంఘం ఎస్టీ విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు శెట్టి నీలవేణి డిమాండ్
అల్లూరి జిల్లా,అనంతగిరి :కాకినాడ జిల్లా రౌతులపూడి మండలానికి చెందిన గౌరవ మండల అధ్యక్షురాలు విజయలక్ష్మిపై దాడికి పాల్పడ్డ గిరిజనేతరులపై ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎంపీపీల సంఘం ఎస్ టి విబాగా రాష్ట్ర అధ్యక్షురాలు శెట్టి నీలవేణి మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రౌతులపూడి ఎంపీపీ విజయలక్ష్మి గిరిజన తెగ మహిళగా కాగా ఆమెకు మండలాధ్యక్షురాలుగా ఉంటూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అటువంటి ఆమెను పిహెచ్ సి ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోగా దానిని ప్రశ్నించిన ఎంపీపీ గారిపై దాడికి పాల్పడడం ఎంతవరకు సమంజసం అని నీలవేణి ప్రశ్నించారు. గిరిజన తెగకు చెందిన మహిళ ఎంపీపీ స్థానంలో ఉన్నప్పటికీ ఆమెకు దక్కాల్సిన ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోగా ప్రశ్నించడానికి తట్టుకోలేక దాడులకు పాల్పడడం రాజ్యాంగాన్ని అపహాసం చేసినట్లేనని నీలవేణి మండిపడ్డారు. విజయలక్ష్మి గారి పై దాడికి పాల్పడిన వారిపై బేషరతుగా కేసు నమోదు చేసి కఠిన శిక్ష పడేలా పోలీస్ యంత్రాంగం సహకరించాలని కోరారు. ఆమెపై దాడిని ఖండిస్తూ బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులో జిల్లా ఎంపీపీ లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ఆ కార్యక్రమానికి ఎంపీపీ లందరూ హాజరు అవ్వాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.ఈ దాడిపై ఎంపీపీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు మేకల హనుమంతరావు నేతృత్వంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆమె తెలిపారు.