contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

శంకుపర్తి రోడ్డుకు మోక్షం కలిగించండి మహాప్రభో

  • అడుగడుగునా ఆటంకం కలిగిస్తున్న పారెస్ట్ డిపార్ట్మెంట్
  • అధికారుల సమన్వయలో పంతో గిరిజన గ్రామాలకు దూరం అవుతున్న రోడ్లు
  • మోకాళ్లపై మొక్కుతున్న గిరిజనులు

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పరిధిలో గల గుమ్మకోట పంచాయతీలో ఉన్న సంకుపర్తి రోడ్డు పనులకు అటవీ శాఖ అడ్డంకులు తొలగించి రహదారి పనులను పూర్తి చేయండి మహాప్రభో అంటూ స్థానిక సర్పంచ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పాగి అప్పారావు నేతృతంలో స్థానిక గిరిజనులు మోకాళ్ళపై మొక్కుతూ బుధవారం నిరసన చేపట్టారు.

ఈ సందర్బంగా అనంతగిరి మండలం సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు,గుమ్మ కోట సర్పంచ్ పాంగి అప్పారావు మాట్లాడుతూ….ఐదేళ్ల క్రితం మంజూరైన రహదారి నిర్మాణ పనులుతో నేటికీ పూర్తి కాలేదని, ఎట్టకేలకు రహదారి పనులు చేయాలని అధికారులు చెప్పడంతో రెండు రోజుల క్రితం పనులు ప్రారంభించగా మరల ఫారెస్ట్ అధికారులు వచ్చి అనుమతులు లేవని, రహదారులు చేపట్టవద్దని నిలిపివేయడంతో గిరిజనుల ఆశపై నీళ్లు చల్లినట్టు అయిందని ఆవేదనను వ్యక్తం చేశారు.
గుమ్మకోట నుంచి సుమారు 7 కిలోమీటర్ల రహదారిలో శంకుపర్తి, శతాభి ,గాలిపాడు మెట్టువలస గ్రామాలకు కనీస రహదారి సౌకర్యం లేక నిత్యము స్థానిక గిరిజనులు నానఅవస్థలు పడుతున్నారని రహదారికి నిధులు మంజూరైన అటవీశాఖ అడ్డంకులు తెలపడంతో పనులు పూర్తి కావడం లేదని దింతో గిరి శిఖర గ్రామాల సమస్యలు పరిష్కరం దశాబ్దాల కాలం నుండి పరిష్కారం కాకపోవడం చాలా దారుణం అని అన్నారు.

అలాగే రహదారితో సమస్యతోపాటు గాలిపాడు, శంకుపర్తి,శతాభి, మెట్టువలస,బూర్జవలస గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్క రించాలంటూ స్థానిక గిరిజనులు కలసి డిమాండ్ చేశారు, కనీసం పక్క ఇల్లు నేటికీ మంజూరు కాలేదని గ్రామాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని వారు వాపోతున్నారు. తాగేందుకు నీళ్లు లేక పార్వతిపురం మన్యం జిల్లా,పాచిపెంట మండలం, సిల్లవలస గ్రామానికి నడుచుకుంటూ వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తుందని నీటిని ఇచ్చేందుకు అక్కడ గిరిజనులు ఒప్పుకోక పోవడంతో తరచూ గొడవలు పడాల్సిన దుస్థితి నెలకొందని గిరిజనులు వాపోతున్నారు, తాగునీటి సదుపాయం కల్పించాలని, అదేవిధంగా పాఠశాల భవనాలు లేక విద్యా వ్యవస్థ కుంటుపడుతుందని పక్క భవనాలను మంజూరు చేయాలని గిరిజనులు వేడుకొంటున్నారు,
దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్ అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్న దొర, ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ,ఎంపీ మాధవి,ఎస్టీ కమీషన్ చైర్మన్ కుంభా రవిబాబు,జీసీసీ చైర్ పర్సన్ శోభ స్వాతి రాణి, జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర జోక్యం చేసుకొని శంకుపర్తి రహదారికి అటవీ శాఖ అనుమతులు వచ్చేలా చూడాలని,గిరి శిఖర గ్రామాల సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు.

ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పలు గ్రామాల గిరిజనులు, ఉప సర్పంచ్ కన్నయ్య, తదితరులు పాల్గొన్నారు

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :