- బీఆర్ఎస్ వస్తే సంక్షేమం….కాంగ్రెస్ వస్తే అంధకారం
- ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్
- గన్నేరువరం మండల కేంద్రంలో ప్రజా ఆశీర్వాద సభ
- కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణ లో రైతు ఆత్మహత్యలు లేవు
- కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు
- భారీగా తరలివచ్చిన ప్రజలు
- కాంగ్రెస్ కు ఓటేస్తే తెలంగాణ ను అమ్మేస్తారు
- బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
- బీఆర్ఎస్ లో భారీగా చేరికలు
- బతుకమ్మలు, బోనాలతో స్వాగతం పలికిన ఆడబిడ్డలు
- ప్రజలందరూ సారూ..కారు.. కేసీఆర్ సర్కారు అనే మాటలనే నమ్ముతున్నారు
- నయవంచకులు కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ఆగం కావొద్దు
కరీంనగర్ జిల్లా: ప్రజలు కాంగ్రెస్ నయవంచక నాయకుల మాటలు నమ్మి ఆగం కావొద్దని.. కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రజలు అంధకారంలో పడ్డట్టేనని తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణా సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు రైతు ఆత్మహత్యలు ఉండేవని.. సాగునీళ్లు లేక సాగు చేసిన పంటలు కళ్ళ ముందే ఎండిపోతే రైతులు పంట పొలాల్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయని, కరెంటు కోతల కారణంగా కాంగ్రెస్ రైతులకు అన్యాయం చేసిందన్నరు.గన్నేరువరం మండల కేంద్రంలో ఆదివారం రాత్రి ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. గన్నేరువరం గ్రామస్తులు, ఆడబిడ్డలు డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా బతుకమ్మలు,బోనాలతో ఘనస్వాతం పలికారు.
కాంగ్రెస్ మండల మహిళ అధ్యక్షురాలు గొడుగు శ్రీలత తో పాటు 100 మంది బీఆర్ఎస్ లో చేరగా గౌరవ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. గన్నేరువరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా గౌరవ తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్,మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ అరవై ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చేయని అభివృద్ధి ఇప్పుడు ఒక్క చాన్స్ అనే పేరుతో ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని అన్నారు.అరవై ఏళ్ల కాలంలో కాంగ్రెస్ చేయని అభివృద్ధి ని కేసీఆర్ పదేళ్ల కాలంలో చేసి నిరూపించారని పేర్కొన్నారు.
కేసీఆర్ వస్తే సంక్షేమం.. కాంగ్రెస్ వస్తే అంధకారం అని అన్నారు.
ఒకప్పుడు సాగునీళ్లు, త్రాగునీళ్లు లేక గల్ఫ్ దేశాలు, ముంబాయి, హైదరాబాద్, భీవంటి ప్రాంతాలకు వలస పోయిన రైతులు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి లక్షలాది ఎకరాలకు సాగు నీళ్లు ఇచ్చిన తర్వాత రైతులు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు కూలీలను వలస తీసుకువచ్చే స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు.రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ.10వేల పెట్టుబడి సాయం, రైతుభీమా ద్వారా రైతులు మరణిస్తే రూ.5లక్షల సాయం చేయడం జరుగుతుందన్నారు.రైతులకు మరింత అండగా ఉండాలనే లక్ష్యంతో రైతుబంధు సాయాన్ని రూ.16వేలకు పెంచడం జరుగుతుందన్నారు.
తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇస్తామని పేర్కొన్నారు. దీంతో పాటు తెల్లరేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి రూ.5లక్షల భీమా సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఆడబిడ్డల పెళ్లికి నయాపైసా సాయం లేయలేదని, కేసీఆర్ సీఎం అయ్యాక కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా రూ. లక్ష సాయం చేయడం జరుగుతుందన్నారు.
కాంగ్రెస్ హయాంలో ఒకరు మరణిస్తేనే మరొకరికి పెన్షన్ వచ్చేదని…కేసీఆర్ సీఎం అయ్యాక వికలాంగులకు రూ.4016, ఆసరా ద్వారా రూ.2016 పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పుడు మేనిఫెస్టోలో వికలాంగులకు రూ.6016, ఆసరా పెన్షన్ లబ్దిదారులకు రూ.5016 పెన్షన్ ఇస్తామని పేర్కొన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో ఏడాది కాలంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని….కర్ణాటక రాష్ట్రంలో వ్యవసాయానికి 5గంటల కరంటు ఇస్తున్నారని ….గసొంటి దొంగలబండి కాంగ్రెస్ పాలన కావాలా అన్నారు. తెలంగాణ లో వ్యవసాయానికి 24 గంటల కరంటు ఇవ్వడం జరుగుతుందని… రైతులకు ఎప్పుడూ అవసరం ఉంటే అప్పుడు చెరువుల్లోకి కాల్వల ద్వారా నీళ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతుల నోట్లో మట్టికొట్టే విధంగా కాంగ్రెస్ నాయకులు రైతుబంధు నిలిపివేయాలని ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారని అన్నారు. కాంగ్రెస్ కు నమ్మి ఓటేస్తే మళ్లీ కరెంటు కోతలు తప్పవని పేర్కొన్నారు.
రైతులకు రైతుభీమా మాదిరిగానే తెల్లరేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి రూ.5లక్షల భీమా సదుపాయం కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అన్నీ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ. 1.20లక్షల ఖర్చు చేయడం జరుగుతుందన్నారు.
33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి ఏడాదికి 10వేల మంది డాక్టర్లను తయారు. చేయడం జరుగుతున్నదని పేర్కొన్నారు.కాంగ్రెస్ అభ్యర్ధి కవ్వంపల్లి సత్యనారాయణ నువ్వు మెడికల్ కాలేజీలో చదివినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 3మాత్రమే మెడికల్ కాలేజీలు ఉండేవని అన్నారు. ఈకార్యక్రమంలో జెడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి, ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు తీగల మోహన్ రెడ్డి, ఎంపిటిసి ల ఫోరం అధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు,వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ ప్రజలు మహిళలు యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.