చిత్తూర్ జిల్లా, చౌడేపల్లి : యూరియా కోసం రైతులు అగచాట్లు పడుతున్నారు. మండల వ్యాప్తంగా వరి నాట్లను రైతులు వేసే క్రమంలో ఉన్నారు. ఇందులో భాగంగా యూరియాకు ప్రాధాన్యత పెరిగింది. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నప్పటికీ ఒక బస్తా కూడా దక్కలేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి రైతులకు యూరియాను సరఫరా చేయాలని వారు కోరుతున్నారు. పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.









