contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ముని వెంకటప్ప సేవలు చరస్మరణీయం

చిత్తూరు జిల్లా చౌడేపల్లి: చిత్తూరు మాజీ ఎంపీ ఎం. రెడ్డప్ప, ప్రముఖ సేవా నైపుణ్యులు ముని వెంకటప్ప సేవలను చిరస్మరణీయంగా కొనియాడారు. గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా సేవలందించిన ముని వెంకటప్ప  11వ వర్ధంతిని పురస్కరించుకుని, చౌడేపల్లి మండలంలోని లదిగం గ్రామంలోని చర్చిలో ప్రత్యేకంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా, ఎం. రెడ్డప్ప మాట్లాడుతూ, “ముని వెంకటప్ప  కులమత భేధాలు లేకుండా అందరికీ సేవలు అందించారు. ఆయన సేవలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఆయన విధేయత, కృషి ఈ గ్రామానికి సర్వత్రా గుర్తింపును అందించింది,” అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఫైనాన్షియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ హేమ, విశ్రాంత ఐఎఫ్ఎస్సి అధికారిణి గౌతమి, అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్యాంకు రెడ్డప్ప, మునుస్వామి, గ్రామస్తులు తదితరులు ముని వెంకటప్ప  సేవలను అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :