సిద్దిపేట జిల్లా :బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్,లక్ష్మీపూర్ గ్రామాలను శుక్రవారం సిద్ధిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆకస్మిక పర్యటన చేపట్టారు. మొదటగా
గాగిల్లాపూర్ గ్రామంలో వైకుంఠధామం,నర్సరీ,పల్లె ప్రకృతి వనాలను,సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం గ్రామంలో ప్రతి ఇంటి నుండి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని, స్వచ్ఛ సర్వేక్షన్ లో ప్రజలందరికీ అవగాహన కల్పించాలని, వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున హరితహారం లో మొక్కలను టార్గెట్ ప్రకారం నాటాలని తెలియజేశారు.
అదేవిధంగా లక్ష్మీపూర్ గ్రామంలోని డంపింగ్ షెడ్ లో వర్మీ కంపోస్టు ఎరువు తయారీ విధానాన్ని పరిశీలించారు. ప్రతిరోజు ప్రజల నుండి తడి చెత్త పొడి చెత్త సేకరణ చేసి వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేయాలని అదేవిధంగా పొడి చెత్తను దగ్గర్లోని ప్లాస్టిక్ ఏజెన్సీలకు విక్రయించాలని తద్వారా గ్రామపంచాయతీకి ఆదాయం సమకూర్చుకోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీమతి లింగాల నిర్మల లక్ష్మణ్, జడ్పీటిసి శ్రీమతి కనగండ్ల కవిత తిరుపతి, సర్పంచ్లు అన్నాడి సత్యనారాయణ రెడ్డి, ముక్కిస తిరుపతి రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు పాకాల మహిపాల్ రెడ్డి, ఎంపీటీసీ లు కొమిరే మల్లేశం,ముక్కిస పద్మరాజిరెడ్డి,సీఈఓ రమేష్ ,జిల్లా పంచాయతీ అధికారి దేవకి దేవి,ఏసీపీ సురేందర్ రెడ్డి, సిద్దిపేట డివిజనల్ పంచాయతీ అధికారి మల్లిఖార్జున్ రెడ్డి,ఎంపీడీవో ధమ్మని రాము,పంచాయతీరాజ్ డి ఈ సదాశివరెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ సమ్మయ్య, ఉపాధి హామీ పథకం ఏపీవో రాజబాబు ఆయా గ్రామాల టెక్నికల్ అసిస్టెంట్లు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.